04 December 2018

ఒబామాను క‌లిసిన మ‌న‌ రైతు మోడీ ప‌రువు తీసేశాడు

ఒబామాను క‌లిసిన మ‌న‌ రైతు మోడీ ప‌రువు తీసేశాడు


Dec 04, 2018

ఆరుగాలం కష్టపడి.. ఎండనకా.. వాననకా.. తన రక్తాన్ని చెమటగా మార్చి పంట పండిస్తే కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కకపోవడంతో ఆ రైతు వినూత్న నిరసన తెలిపాడు. అయితే, ఆ నిర‌స‌న ఏకంగా ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించేలా ఉంద‌ని అంటున్నారు. 

ఈ ఆవేద‌న‌లో కూడా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అవాక్కయ్యే రీతిలో ఉందంటున్నారు. రైతు పంటకు పెట్టుబడి కన్నా 50 శాతం లాభం వచ్చేలా చూస్తామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా.. కనీసం పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో ఆ రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. 

మ‌హారాష్ట్రకు చెందిన రైతు నాలుగు నెలలు కష్టపడి 750 కిలోల ఉల్లిగడ్డను పండిస్తే మార్కెట్లో దానిని రూ.1,064కు అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో చెమ్మగిల్లిన కండ్లతో ఆ రైతు వచ్చిన సొమ్మును ఇంటికి తీసుకుపోవడానికి ఇష్టపడక ఆ డబ్బును ప్రధానమంత్రి మోడీకి పంపాడు. 


No comments: